Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 12:01:24
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్ల పారితోషికాలు బాగానే పెరిగాయి. కెరీర్ పరంగా సూపర్ హిట్లతో దూసుకుపోతున్న నాయికలకు మిగతా వాళ్లతో పోలిస్తే కాస్తంత అధికంగా ముట్టచెబుతుంటారు. కానీ ఒక సినిమాకు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్టడమంటే మాత్రం సామాన్యమేం కాదు. ప్రస్తుతం తెలుగులో ముగ్గురు భామలు ఈ రేంజికి చేరుకున్నారనేది టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. వీరిలో ఇద్దరు తర్టీస్ లో ఉన్నవారు కావడం విశేషం.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహోలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కోసం ఈమెకు రూ. 3 కోట్లకు పైగా తీసుకుందని తెలుస్తోంది. భాగ్ మతి సినిమా చేస్తున్నందుకు అనుష్కకు దాదాపుగా ఇంతేమొత్తం దక్కింది. బాలకృష్ణ 102వ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు నయనతార రూ. 3.5 కోట్ల వరకు తీసుకుంటోందనేది లేటెస్ట్ న్యూస్. ఇలా ఒకేటైంలో ముగ్గురు హీరోయిన్లు హీరోల రేంజిలో రెమ్యునరేషన్ తీసుకోవవడం ఇదే ప్రథమం. అయితే వీరికి ఇంత భారీ మొత్తం ఇవ్వాల్సి రావడాన్ని ఆయా దర్శక - నిర్మాతలు నెగిటివ్ గా తీసుకోవడం లేదు. వాళ్లకు ఆ స్థాయి ఉందని... వాళ్లకిచ్చే ప్రతి రూపాయికి తగిన న్యాయం చేసేలా నటించగల ప్రతిభ వాళ్ల సొంతమని అంటున్నారు.

హీరోలతో పోలిస్తే హీరోయిన్లు వెండితెరపై వెలిగిపోయే కాలం తక్కువే. ఎంత సక్సెస్ లు సాధించినప్పటికీ అయిదు నుంచి పదేళ్లలోపు టైంలోనే హీరోయిన్ గా ఫేడవుట్ అయిపోయే నటీమణులు ఎంతో మంది ఉన్నారు. లాంగ్ టైం సక్సెస్ ఫుల్ గా కెరీర్ కంటిన్యూ చేసేవాళ్లు అతితక్కువ మందే ఉంటారు. ఒకవేళ ఉన్నా సీనియర్ హీరోయిన్లు అయ్యేకొద్దీ వాళ్లకిచ్చే మొత్తం తగ్గిపోతూ ఉంటుంది.

,  ,  ,  ,