మాటలతో మ్యాజిక్ చేసే దర్శకుడు త్రివిక్రమ్, లవర్ బాయ్ నితిన్, స్టార్ హీరోయిన్ సమంతల క్రేజీ కాంబినేషన్లో ?అ..ఆ..? పేరుతో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ?అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి? అనే ఆసక్తికర ట్యాగ్లైన్తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్తోనే విపరీతమైన అంచనాలను రేకెత్తించింది. ఇక ఈ టీజర్కు వచ్చిన రెస్పాన్స్తో హ్యాపీ అయిన టీమ్ కొద్దిరోజుల క్రితమే ఏప్రిల్ 26వ తేదీన ఆడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో విడుదలను మే 2వ తేదీకి వాయిదా వేశారు. హైద్రాబాద్లోని శిల్పకళావేదికలో మే 2న సినీ ప్రముఖుల సమక్షంలో పెద్ద ఎత్తున ఆడియో విడుదలను ప్లాన్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్-త్రివిక్రమ్ల కాంబినేషన్లో వస్తోన్న ఈ ఆడియో, సినిమాకు మేజర్ హైలైట్స్లో ఒకటిగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.