Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2015 11:37:30
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడంతా సీక్వెల్స్ కాలం నడుస్తోంది. గతంలో ఘనవిజయాలను సొంతం చేసుకున్న తమ సినిమాలకు సీక్వెల్ ని వదిలే పనిలో ఎవరికివారు బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలోనే 'పందెంకోడి' చిత్రం కూడా లైను మీదకి వచ్చింది. విశాల్ కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన ఈ సినిమా అటు తమిళ్లోను .. ఇటు తెలుగులోను అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడీ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా 'అక్షరాహాసన్' ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

అక్షరాహాసన్ ని తీసుకోవడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాలు కోలీవుడ్లో వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో ఈ సినిమాలో కథానాయికగా చేసిన మీరా జాస్మిన్ ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ వుండటం కూడా, ఈ సినిమాకి మరో విశేషంగా మారనుంది. లింగుస్వామి దర్శకత్వంలో ఈ కథ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. బాలీవుడ్ చిత్రం 'షమితాబ్' లో నటించి మంచి మార్కులు సంపాదించుకున్న అక్షరా హాసన్, తమిళ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,