ప్రస్తుతం తను చేస్తున్న డీజే దువ్వాడ జగన్నాధం మూవీని పూర్తి చేసేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని వారాల పాటు మాత్రమే ఈ ప్రాజెక్టుపై వర్క్ చేయనున్న బన్నీ.. ఈ నెలాఖరు కల్లా డీజేను పూర్తి చేసేయనున్నాడు. ఏప్రిల్ లో సరైన డేట్ చేసుకుని.. దువ్వాడ జగన్నాధంను రిలీజ్ చేయాలని భావిస్తుండగా.. అదే నెలలో కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం కూడా ఖాయం చేసేసుకున్నాడు.
ఏప్రిల్ 8న వక్కంతం వంశీతో చేయనున్న తన కొత్త సినిమా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' ను ప్రారంభించబోతున్నాడు బన్నీ. ఇండియా ఇంటికి అదే రోజు ముహూర్తం పెట్టడంలో.. ఆ రోజుకు మరో విశేషం ఉందని మెగాభిమానులకు తెలుసు. ఏప్రిల్ 8 బన్నీ బర్త్ డే కాగా.. అదే రోజుకు కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. గతేడాది సరైనోడు చిత్రం కూడా ఇదే డేట్ కి రావాల్సి ఉండగా.. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం వెనక్కి వెళ్లాడు అల్లు అర్జున్.
వక్కంతం వంశీ దర్శకత్వ అరంగేట్రం చేస్తున్న ఈ ప్రాజెక్ట్.. ఎక్కువ భాగం వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకోనుండగా.. మిగిలిన భాగాన్ని గోవాలో తీస్తారట