మెగా హీరో అల్లు శిరీష్ మొత్తానికి హీరోగా గుర్తింపు సాధించాడు..శ్రీ రస్తు శుభమస్తు ముందు వరకు కూడా శిరీష్ ను హీరోగా కాదు కదా కనీసం ఆర్టిస్ట్ గా కూడా పనికిరాడు అనేంతలా విమర్శలు చేసారు. కానీ శ్రీరస్తు తర్వాత శిరీష్ ను అభినందించడం మొదలు పెట్టారు. లుక్స్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మెరుగుపడడం తో అందరూ శిరీష్ ను హీరో గా గుర్తించారు..
తాజాగా శిరీష్ , మిల్కీ బ్యూటీ తమన్నా తో జత కట్టాడు..ఏంటి ఏ సినిమాలో అని ఆశ్ఛర్యపోకండి..జెస్ట్ యాడ్లో మాత్రమే వీరిద్దరూ కలిసి నటించారు. ఓ షాంపూ యాడ్ లో వీరిద్దరూ నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ టీవీల్లో మారుమోగిపోతుంది..ఈ యాడ్ చూసినవారంతా అదేంటి తమన్నా , ఇతడి తో చేయడమేంటి అని షాక్ అవుతున్నారు..అంతే ఎందుకు అల్లు అరవింద్ తలచుకుంటే శిరీష్ నెక్స్ట్ సినిమాలో తమన్నానే హీరోయిన్ గా పెట్టుకుంటాడు.