వరుస ఫ్లాపుల్లో వున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన ఆశలన్నిటినీ 'టెంపర్' చిత్రంపైనే పెట్టుకున్నాడు. వరుసగా ఆయన నటించిన 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' రెండూ ప్రేక్షకులను అలరించడంలో ఫెయిలవడంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తనకు మంచి సక్సెస్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది. కాగా, ఈ సినిమా ఆడియో వేడుకను సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి రోజున అంటే జనవరి 18న హైదరాబాదులో గ్రాండుగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.
ntr, purijagannadh, newdialoguedelivery, bandlaganesh, audioon18th,