అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ?సరైనోడు? సినిమా విడుదలకు రంగం సిద్ధం అయింది. అయితే ?సరైనోడు? ని చూసిన మొదటి ప్రేక్షకుడిని తానే అవ్వాలన్న చిరంజీవి కోరిక మేరకు ఈ సినిమా ను ప్రత్యేకంగా ఆయనకోసం షో వేయించుకుని చూస్తున్నారన్న వార్తను మేం ఇంతకుముందే చెప్పాం.
?సరైనోడు? సినిమా మెగాస్టార్, ఆయన కుటుంబ సభ్యులను బాగా ఆకట్టుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా దర్శకుడు బోయపాటి శీను అల్లు అర్జున్ ని మాస్ హీరోగా చూపిన విధానానికి మెగాస్టార్ ఆశ్చర్యపోయారని తెలిసింది. ఈ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ దర్శకుడు బోయపాటి శీను ని కలిసి అభినందించినట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు.