చిరంజీవి 150వ సినిమా కోసం ఆయన అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే పరిస్థితులు అందుకు అనుకూలించడానికి సమయం పట్టింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఆయన సినిమా పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ... కథారచయిత బీవీఎస్ రవి (మచ్చ రవి) .. చిరంజీవికి టచ్ లో ఉంటూ కథకి పూర్తి రూపాన్ని తీసుకువచ్చారట. కథకి అన్ని విధాలుగా తగినట్టుగా ఉంటుందని 'ఆటోజానీ' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు కూడా.
మొదటి నుంచి కూడా చిరంజీవి మాస్ ఆడియన్స్ కి మరింత చేరువుగా వెళ్లే కథలను ఎంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పద్ధతిని కొనసాగిస్తుండటం విశేషం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22 న.. ఆయన అభిమానులకి ఆనందాన్ని కలిగిస్తూ ఈ సినిమా షూటింగును లాంఛనంగా ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.