పటాస్ తర్వాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కు ఆ స్థాయిలో చెప్పుకోదగగ హిట్ దొరకలేదు. చివరగా పూరి జగన్నాథ్ తో చేసిన ఇజం కూడా పర్వాలేదనిపించుకున్నా ఆసీనహీన విజాన్నైతే అందివ్వలేదు. అందుకే కళ్యాణ్ రామ్ కాస్త గ్యాప్ తీసుకుని బాబాయ్ బాలకృష్ణకు కెరీర్లో మైలురాయి లాంటి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు క్రిష్ తో నెక్స్ట్ సినిమా చేయనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం జరిగిన బాలకృష్ణ – పూరిల సినిమా ప్రారంభోత్సవ వేడుకకు హజరైన క్రిష్ ను బాలకృష్ణ కళ్యాణ్ రామ్ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని అడిగారని, దానికి క్రిష్ మే నెలలో అలయ్యే ఛాన్స్ ఉందని చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై క్రిష్, కళ్యాణ్ రామ్ ల నుండి ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం కల్యాణ రాం తన సోదరుడు ఎన్టీఆర్ చిత్ర నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు.