హైదరాబాద్: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్పై సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'తిక్క'. సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలీవుడ్ ఐటం గర్ల్ సాయి ధరమ్ తేజ్, ఫరాహ్ కరిమి కాంబినేషన్లో ఇక్కడ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ఫరాహ్ కరిమి అందం ఈ సినిమాకు హైలెట్ అవుతుందని, తెరపై ఫరాహ్ కరిమి అందం చూసిన తర్వాత మెగా అభిమానుల తిక్క దిగిపోవడం ఖాయం అంటూ కొందరు చమత్కరిస్తున్నారు.
సినిమా గురించి నిర్మాత సి.రోహిణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం భారీ సెట్ వేసి అందులో సాయిధరమ్ తేజ్, పరహ్ మధ్య స్పెషల్ సాంగ్ను చిత్రీకరిస్తున్నాం. ప్రేమ్రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్కు డ్యాన్స్ను కంపోజ్ చేస్తున్నారు. తేజ డ్యాన్సులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదరగొడుతున్నాడు. ఈ సాంగ్లోతాగుబోతు రమేష్, సత్య కూడా పాల్గొంటున్నారు. ఈ సాంగ్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అవుతుంది అన్నారు.