Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:26:58
facebook Twitter Googleplus
Photo

రేటింగులు పెంచుకోవడమే లక్ష్యంగా ఛానళ్లు కొత్త సినిమాలు టెలికాస్ట్ చేయడానికి పోటీపడుతుండటం సహజమే. కాకపోతే ఒకేరోజు రెండు సూపర్ హిట్ సినిమాలు ఒకే టైంలో టెలికాస్ట్ కాబోతున్నాయి. అయితే ఇవి రెండూ మెగా హీరోలు.. అందునా అన్నదమ్ముల హిట్ చిత్రాలు కావడం విశేషం. ఈనెల 24న సాయంత్రం 5 గంటలకు జెమినీ టీవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ హిట్ ధృవ ప్రసారమవుతుంది. అదేరోజు అదే టైంకు స్టార్ మాలో వరుణ్ తేజ్ లేటెస్ట్ హిట్ ఫిదా కూడా టెలికాస్ట్ కానుంది.

ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు.. ఒక తెలివైన క్రిమినల్ కు మధ్య జరిగే మైండ్ గేమ్ తో తీసిన సినిమా ధృవ. తమిళంలో తీసిన ‘తని ఒరువన్’ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. డీమానిటైజేషన్ టైంలో రిలీజయినా రూ. 58 కోట్లకు పైగ కలెక్షన్లు రాబట్టింది. ఇక్కడి అమ్మాయికి.. అమెరికా అబ్బాయి మధ్య ప్రేమకథ ఫిధా అందరినీ ఫిదా చేసేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్దన రూ. 50 కోట్ల దాకా కొల్లగొట్టింది. మరి ప్రేక్షకులు ఏ సినిమా టీవీలో మళ్లీ చూడాలని అనుకుంటున్నారా టీఆర్ పీ రేటింగులు వచ్చాకే తెలుస్తుంది.

ధృవ - ఫిదా రెండూ ఒకదానికొకటి సంబంధం లేని సబ్జెక్టులే. సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను మెప్పించిన సినిమాలే. ధృవ సినిమాలో అరవింద్ స్వామి క్యారెక్టర్ హైలైట్ గా నిలిస్తే... ఫిదా సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి క్యారెక్టర్ కు మంచి పేరు లభించింది. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం 1985లో నటిస్తుండగా.. వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చే్స్తున్నాడు.

,  ,  ,  ,  ,