గోపీచంద్ని హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ఆంధ్రుడు ఒకటి. అందులో గోపీ చాలా స్టైలీష్గా కనిపించాడు. తన కెరీర్ని ఆంధ్రుడు బాగా హెల్ప్ అయ్యింది కూడా. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన పరుచూరి మురళికి కాలం కలసి రాలేదు. బాలకృష్ణతో తీసిన అదినాయకుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో చాలా గ్యాప్ వచ్చేసింది.
అయితే ఇప్పుడు గోపీచంద్ మరోసారి మురళికి ఛాన్సిచ్చాడట. గోపీచంద్ ? పరుచూరి మురళి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని ఫిల్మ్నగర్ టాక్. అందుకు సంబంధించిన కథ కూడా రెడీ అయిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆక్సిజన్ చిత్రంలో బిజీగా ఉన్నాడు గోపీచంద్. ఆ తరవాత సంపత్ నందితో ఓ సినిమా తెరకెక్కనుంది. ఆ తరవాత కిరీటీ సినిమా మొదలు కావొచ్చని తెలిసింది.