పూర్తి స్థాయి మాస్ హీరో అన్న బ్రాండ్ నుంచి బయటకొచ్చి సాహసం, లౌక్యం జిల్ లాంటి సినిమాలతో తాను ఇతర తరహా పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించుకున్న గోపీచంద్, తాజాగా ఆక్సీజన్ పేరుతో ఓ ఆసక్తికర సినిమాను సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత నిర్మాత ఏ.ఎమ్.రత్నం కుమారుడు ఏ.ఎమ్.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని శరవేగంగా టాకీ పార్ట్ పూర్తి చేస్తోంది.
ఇక రేపు (ఏప్రిల్ 14న) ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆక్సీజన్ ఫస్ట్లుక్ రిలీజ్ కానుంది. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఒక ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ పకడ్బందీ స్క్రిప్ట్తో సెట్స్పైకి తీసుకెళ్ళినట్లు సమాచారం.