మహేశ్ బాబు మరికొన్నాళ్లు మలేసియాలోనే వుండిపోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీమంతుడు' చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా అక్కడ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే అక్కడ షూటింగ్ పూర్తవ్వాలి. అయితే, మరి కొన్ని దృశ్యాల చిత్రీకరణ పూర్తికానందున షెడ్యూలును పొడిగించినట్టు సమాచారం. దీంతో మే 2 వరకు అక్కడ షూటింగును కొనసాగిస్తారు. ఇదిలా ఉంచితే, సమ్మర్ వెకేషన్ కావడంతో మహేశ్ తన భార్య, పిల్లలను కూడా అక్కడికి తీసుకువెళ్లాడట!
maheshbabu, koratalashiva, tollywood, news, jamindar, boscoceaser, malaysia,