సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు మురుగదాస్ల కాంబినేషన్లో సినిమా కొద్దికాలంగా బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ లెవెల్లో తిరుగులేని పాపులారిటీ ఉన్న హీరో, దర్శకుడు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో సెట్స్పైకి వెళ్ళకముందునుంచే ఈ సినిమా మంచి ఆసక్తి రేకెత్తించింది. ఇక ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పక్కాగా పూర్తి చేసిన టీమ్, నేడు సినిమాను సెట్స్పైకి తీసుకెళ్ళింది. హైద్రాబాద్లో ఈ ఉదయం మురుగదాస్ సినిమాను మొదలుపెట్టేశారు. మహేష్ సెట్స్లో జాయిన్ కావడానికి మరో మూడు రోజులు పడుతుందని సమాచారం.
ఇక మహేష్ సినిమా సెట్స్పైకి వెళ్ళిన సందర్భంగా అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. #AllTheBestToMahesh23, #Mahesh23 ట్యాగ్లతో ట్విట్టర్లో మహేష్ అభిమానులు తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్, చెన్నై, ముంబై, పూణే, గుజరాత్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, సంగీత దర్శకుడు హరీస్ జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్ ? ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తున్నారు.