సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం "నందిని నర్సింగ్ హోమ్" చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా కార్యక్రమానికి వచ్చాడు. వీళ్లతోపాటు నరేష్ - కృష్ణ - విజయ నిర్మల పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ... నవీన్ ఒకప్పుడు బొద్దుగా ఉండేవాడనీ అప్పట్లో ఎడిటింగ్ పనులు చూస్తుంటేవాడనీ నువ్వు భవిష్యత్తులో ఏమౌతావని సరదాగా అడిగితే... నటుడు అవుతా అని చెప్పాడని మహేష్ అన్నారు. ఆ మాటను చాలా సీరియస్ తీసుకుని ఎంతో కష్టపడి తన బాడీ వెయిట్ తగ్గడంతోపాటు సిక్స్ ప్యాక్ ను కూడా బిల్డప్ చేశాడని మహేష్ బాబు చెప్పాడు. మహేష్ బాబు గురించి ఇక్కడ చెప్పుకోవాల్సింది మరో ఘటన కూడా ఉందండోయ్! తోటి కళాకారులపై తనకున్న మర్యాదను మహేష్ చాటుకున్నాడు.
వేదిక మీద మహేష్ బాబు వెనక ఎక్కడో సాయి ధరమ్ నిలబడి ఉన్నాడు. మహేష్ స్టేజ్ మీదికి రాగానే రొటీన్ గా ఉండే హడావుడే ఉంది. అతడి చుట్టూ చాలామంది ఉన్నారు. అయితే ఇంత హడావుడిలో కూడా మహేష్ బాబు వెనక్కి తిరిగి... సాయిధరమ్ ను దగ్గరకి పిలిచాడు. పిలిచి మరీ పక్కన నిలబెట్టుకుని ఫొటోస్ కు ఫోజులు ఇచ్చాడు. తోటి నటుల పట్ల సీనియర్ నటులకు ఉండాల్సిన సంస్కారాన్ని చాటి చెప్పుకున్నాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా స్టేజ్ మీద సాయిధరమ్ కూడా ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ - స్వయంగా పిలిచి అతడికీ ప్రాధాన్యత కల్పిస్తూ మహేష్ ప్రవర్తించిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. తోటి నటుల పట్ల ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోల పట్ల టాప్ హీరోలకు తనకున్న అభిమానాన్ని మహేష్ బాబు చాటి చెప్పుకున్నాడు.