సినిమాలతో కంటే టీవీ షోలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది మంచు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ టాక్ షో దగ్గర్నుంచి ఆ తర్వాత కూడా ఆమె చేసిన షోలన్నీ బాగానే పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ?మేముసైతం? కార్యక్రమంతో లక్ష్మి అందరి మనసులు గెలుచుకుంది. ప్రజా ప్రయోజనం ముడిపడ్డ ఈ ప్రోగ్రాం అందరి మన్ననలు అందుకుంటూ విజయవంతంగా నడుస్తోంది. ఈ షో కోసం టాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది ముందుకొచ్చారు. తమ వంతు ప్రయత్నంతో అభాగ్యుల్ని ఆదుకున్నారు. ఐతే ఈ షోకు తాను ప్రభాస్ ను మాత్రం పిలవలేకపోయానని.. రాజమౌళి అంటే భయమే అందుకు కారణమని చెప్పింది లక్ష్మి.
??టాలీవుడ్లో చాలామందిని నా షోకి పిలిచాను. ఎంతోమంది వచ్చి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అలాగే రాని వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కొందరు వస్తామని చెప్పి.. రాలేదు. మీరు మీలా ఉండండి అంటే అలాంటి వాళ్లు భయపడతారు. రానివాళ్లకి సహాయం చేసే అదృష్టం లేదని అనుకుంటాను. ఐతే నేను పిలవని వాళ్లు కూడా కొందరున్నారు. అందులో హీరో ప్రభాస్ ఒకడు. తనను పిలవకపోవడానికి కారణముంది. ఎందుకంటే అతను ?బాహుబలి ? షూటింగులో చాలా బిజీగా ఉన్నాడు. అతణ్ని పిలిస్తే రాజమౌళి గారికి కోపం వస్తుందేమో అని భయపడి ఇప్పటివరకూ పిలవలేదు?? అని మంచు లక్ష్మి తెలిపింది.