Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Oct-2016 13:14:45
facebook Twitter Googleplus
Photo

సాదారణంగా ఏదైనా పెద్ద సినిమా - స్టార్స్ సినిమా విడుదలవుతుందంటే... ఆ సమయానికి థియేటర్లలో ఆడుతున్న చిన్న సినిమాలను ఉన్నపలంగా తీసేస్తారు. అయితే ఆ హడావిడి భారీ సినిమాలు సరిగా ఆడకపోతే తిరిగి ఆ చిన్నసినిమాలే వారికి దిక్కై... తిరిగి వాటినే కొత్త పోస్టర్స్ అంటించి ప్రదర్శిస్తుంటారు. ఇది చాలా చోట్ల చాలా సందర్భాల్లో జరిగిందే. ఈ విషయంలో దాసరి నారాయణరావు అయితే... ఏకంగా సినిమాల పేర్లనే ప్రస్థావిస్తూ ఫైరయిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సమస్య తన కుమారుడు హీరోగా నటించిన "జాగ్వార్" కి వచ్చిందని ఫైరవుతున్నారు ఆ చిత్ర నిర్మాత కుమార స్వామి.

కన్నడ చలనచిత్ర రంగంలోని కొంత మంది కారణంగా శాండిల్ వుడ్ పరిశ్రమ అప్రతిష్ట పాలవుతోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వీయ నిర్మాణంలో తన కుమారుడు నిఖిల్ ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తూ "జాగ్వార్" చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ చిత్రం సక్సెస్ మీట్ లో మాట్లాడిన కుమారస్వామి... దీపావళి సందర్భంగా ఇద్దరు అగ్రనటుల సినిమాలు విడుదలవుతున్నాయని - కేవలం అవి అగ్రహీరోల సినిమాలనే కారణంతో... ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న తమ "జాగ్వార్" చిత్రాన్ని థియేటర్ల నుంచి తొలగించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆవేదన - ఆగ్రహం కలిపి వ్యక్తం చేసిన కుమార స్వామి... తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాను కూడా గతంలో ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించానని ఇతర చిత్రాలకు నష్టం వాటిల్లకుండా అప్పటికి అందుబాటులో ఉన్న థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేసుకునే వాళ్లమని గుర్తు చేశారు. విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకాదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శిమవుతున్న తమ "జాగ్వార్" చిత్రాన్ని ఎలా అడ్డుకుంటారో తాను చూస్తానని... ఆర్థికంగా బలంగా ఉన్న కొంత మంది కబంద హస్తాల్లో కన్నడ ఇండస్ట్రీ నలిగిపోతోందని.. ఇకపై ఈ విషయంలో ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.

,  ,  ,  ,  ,