బెంగాల్ టైగర్ తర్వాత అనుకోకుండా సుదీర్ఘ విరామం తీసుకున్నాడు మాస్ రాజా రవితేజ. అంతకుముందు కమిటైన దిల్ రాజు సినిమాకు బ్రేక్ పడటంతో అనుకోకుండా ఈ గ్యాప్ వచ్చేసింది. ఇదిగో అదిగో అనుకుంటూనే పది నెలలు గడిపేశాడు. ఐతే ఈ మధ్యే ?పవర్? ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన రవితేజ.. వచ్చే నెలలోనే ఆ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరోవైపు మాస్ రాజా తర్వాతి సినిమాకు కూడా రంగం సిద్ధమైంది. లక్ష్మీ? - ?లక్ష్యం? - ?రేసు గుర్రం? లాంటి సినిమాలు నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ నల్లమలుపు శ్రీనివాస్.. మాస్ రాజాతో తొలిసారి ఓ సినిమా చేయబోతున్నాడు.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. రేసుగుర్రం సినిమాలకు స్క్రీన్ ప్లే విభాగంలో పని చేసిన రచయిత విక్రమ్ సిరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. ఎన్టీఆర్ తో ?అదుర్స్? సినిమాను నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ సినిమా గురించి నల్లమలుపు శ్రీనివాసే అధికారిక ప్రకటన కూడా చేశాడు. ?రవితేజ హీరోగా మా సంస్థలో ఇదే తొలి సినిమా. మంచి కథ కుదిరింది. వక్కంతం వంశీ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ తయారు చేశారు. శాసన సభ్యుడైన వల్లభనేని వంశీతో కలిసి ఈ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తాం? అని అతను చెప్పాడు.