నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ఎవడే సుబ్రమణ్యం నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన జెంటిల్మన్ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమా మజ్నును విడుదలకు సిద్ధం చేయడమే కాక, మరో సినిమాను కూడా సెట్స్పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధమైపోయారు. ?సినిమా చూపిస్త మావా? ఫేం త్రినాధరావు నక్కిన తెరకెక్కించనున్న ఈ సినిమా రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
నాని స్టైల్లో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ సినిమాకు ?నేను లోకల్? అన్న టైటిల్ను ఖరారు చేసేశారు. నాని సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు. ఇక నాని నటిస్తోన్న మజ్ను సినిమా విషయానికి వస్తే, విరించి వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.