దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా సంచలన నిర్ణయాన్నితీసుకుంది. ఇకపై.. సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం తప్పనిసరి చేయాలని చెప్పింది. సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభంలో జనగణమణ తర్వాతే సినిమాను వేయాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని.. జాతీయ పతాకాన్ని గౌరవించాలని చెప్పింది.
జాతీయ గీతాన్ని ప్రదర్శించటం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇకపై సినిమా స్టార్టింగ్ లో జాతీయ గీతాలాపనతో సినిమా ప్రదర్శన ప్రారంభం కానుంది. దేశంలోని ప్రతి ఒక్కరూజాతీయ గీతాన్ని.. జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది అని పేర్కొంటూ తాజా ఆదేశాలు జారీ చేసింది. అదేసమయంలో జాతీయ గీతాన్ని యథాతధంగా వినియోగించాలే కానీ.. మార్పులు చేర్పులు చేయరాదని చెప్పింది