ఈ మధ్య సినిమాల్లో బాగా కనిపిస్తోన్న గ్రాఫిక్స్ వర్క్స్
కథకు కరెక్ట్ గా సెట్ అవ్వకపోయినా కావాలని ఎదో ఒక చోట ఇరికించి సినిమా స్థాయిని పెంచాలని చూస్తారు. కానీ కొంతమంది దర్శకులు అవసరం అయితే గాని గ్రాఫిక్స్ జోలికి వెళ్లారు. ఇక జక్కన్న రాజమౌళి మాత్రం తన కథను బట్టి గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ఉపయోగిస్తాడు. ఒకవేళ తనకు నచ్చితే అందుకు తగ్గ సిన్ క్రియేట్ చేసుకొని ఆ ఆలోచన అందరికి నచ్చేలా విజవల్ వండర్ ని చూపిస్తాడు.
ఇక అసలు విషయాన్ని వస్తే ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో తీయబోయే మల్టి స్టారర్ కథలో జక్కన్న గ్రాఫిక్స్ ని అంతగా వాడటం లేదని తెలుస్తోంది. ఎక్కువగా ఎమోషన్స్ ని చూపించే విధంగా తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కూర్చొని కథపై కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా కాన్సెప్ట్ ని హీరోలిద్దరికి చెప్పి సినిమాలో ఎమోషన్స్ ప్రదానం కానున్నాయని గ్రాఫిక్స్ ఉండవని వివరించాడట.
అలాగే కథకు తగ్గట్టుగా ఫిట్నెస్ పై జాగ్రత్తలు కూడా తీసుకోవాలని జక్కన్న వారికి ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో రాజమౌళి రెగ్యులర్ యాక్షన్ సీన్స్ మాత్రం ఎప్పటిలానే అలరించనున్నాయని రీసెంట్ గా జక్కన్న సన్నిహితుల నుండి ఈ సమాచారం అందింది.