Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2017 09:59:19
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ తారలు ఇటువైపు తిరగాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. బాహుబలి సినిమాతోనే ఒక్కొక్కరికి దిమ్మ తిరిగింది. అంతకుముందు తెలుగు సినిమా ఇండస్ట్రీని తక్కువగా చూసే కొంత మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే చేయాలనీ ఉంది అని చెబుతున్నారు. బాహుబలి తర్వాత దర్శకదీరుడు ఎలాంటి సినిమా చేస్తాడా అని బాలీవుడ్ - కోలీవుడ్ లో కూడా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఫైనల్ గా దర్శకదీరుడు షాకింగ్ పిక్ తో షేక్ చేసి అభిమానుల ఉహలకే వదిలేయడంతో రూమర్ కాస్త నిజమైంది. రీసెంట్ గా మొదటి సారి సాయి ధరమ్ తేజ్ కూడా సినిమా ఉందని ఫైనల్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో భారీ మల్టి స్టారర్ అనే సరికి అంచనాలు తారా స్థాయిలో మొదలయ్యాయి. అయితే ఈ సినిమా అసలు కథను ఇప్పటికే విజయేంద్రప్రసాద్ ఫిక్స్ చేశారట. సినిమాలో చెర్రీ - తారక్ బ్రదర్స్ అని తెలుస్తోంది.

అంతే కాకుండా వారు బాక్సర్లు గా కనిపించబోతున్నట్లు టాక్. ఇక సినిమాను నిర్మించేది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఇంటర్వ్యూలలో జక్కన్న నా నెక్స్ట్ సినిమా తప్పకుండా డివివి.దానయ్య గారి ప్రొడక్షన్ లోనే ఉంటుందని చెప్పేశాడు. ఇక సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందా? అని ప్రతి ఒక్కరు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ముందుగా రాజమౌళి అండ్ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషనే 80 కోట్లు దాటుతుంది. ఇక మిగతావారికి అంతా ఇచ్చే దానితో కలిపితే మొత్తంగా 110 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ కే వెళ్లవచ్చు అంటున్నారు.

ఇక ఫైనల్ గా మూవీ స్టోరీని బట్టి ఓ 70 కోట్లతో పూర్తి చేయాలనీ డిసైడ్ అయ్యారట. మొత్తంగా సినిమా బడ్జెట్ 170 నుంచి 180 కోట్ల మధ్యలో అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,