గత కొన్నాళ్లుగా ఎడమొహం పెడమొహంగా వుంటున్న నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు చాలా కాలం తర్వాత ఒకే వేదికను పంచుకోనున్నారు. వీరిద్దరినీ కలిపే బాధ్యతను నందమూరి కల్యాణ్ రామ్ తీసుకున్నాడు. తాను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న 'పటాస్' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 7న హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తున్నాడు. నందమూరి అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్ విచ్చేస్తున్నట్టు సమాచారం. సో ... బాబాయ్, అబ్బాయ్ ల అభిమానులకు ఇక ఆ రోజు పండగే!
ntr, balakrishna, patasaudio, kalyanram,