Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 12:40:54
facebook Twitter Googleplus
Photo

సినిమాల సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలతో లాంఛ్ లు చేయించడం అనే ట్రెండ్ బాగా పెరిగింది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ మూవీస్ వరకు అన్నిటికీ స్టార్స్ ను.. క్రేజ్ ఉన్నవారిని వాడేస్తున్నారు. ఇది ఆయా సినిమాలపై బజ్ క్రియేట్ చేసేందుకు బాగానే ఉపయోగపడుతోంది.

అయితే.. అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ఒక్క క్షణం విషయంలో మాత్రం మేకర్స్ కొత్త ఐడియా వేశారు. ఇప్పటికే ప్రమోషన్స్ ను తెగ చేసేస్తున్న ఈ మూవీ టీం.. అభిమానులతో ట్రైలర్ లాంఛ్ చేయించాలని డిసైడ్ అయ్యారు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు.. ఫ్యాన్స్ మహారాజ పోషకులు అనే సంగతి తెలిసిందే. అందుకే వారికి ఇంపార్టెన్స్ ఇస్తూ.. ఇవాళ విడుదల చేయనున్న ట్రైలర్ ను మెగా ఫ్యాన్స్ తో లాంఛ్ చేయించనున్నారు. డిసెంబర్ 22 సాయంత్రం 6 గంటలకు జరగనున్న వేడుకలో ఈ లాంఛింగ్ కార్యక్రమం జరగనుంది.

ఎక్కడకి పోతావు చిన్నవాడా తర్వాత దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందించిన మూవీ కావడం.. శ్రీరస్తు శుభమస్తు సక్సెస్ తర్వాత అల్లు శిరీష్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సురభి.. సీరత్ కపూర్ లు హీరోయిన్ గా నటించిన ఒక్క క్షణం చిత్రంలో శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించాడు.

,  ,  ,  ,  ,