సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ?కబాలి? సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 200 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్ళు రాబట్టింది. ఇక సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ దర్శకుడు పా రంజిత్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ?రజనీ కాంత్ ?కబాలి? అనగానే అందరూ ?భాషా? లాంటి సినిమా ఆశించారు. నేను అలాంటి సినిమా తీయలేదని నాకు ముందే తెలుసు. అందుకనే రిలీజ్ రోజు చాలా టెన్షన్ పడ్డా. అయితే అందరూ సినిమాను మెచ్చుకుంటూ ఉండడం, బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా నిలబడడం నా టెన్షన్ను పోగొట్టింది? అని పా రంజిత్ తెలిపారు.
ఇక ప్రస్తుతానికి ?కబాలి? సినిమాలో తాను ఏమేం తప్పులు చేశానో, ఇంకా దర్శకుడిగా ఎలా ఎలా ఎదగొచ్చో తెలుసుకుంటున్నానని, కొద్దిరోజులు గడిచాకే తన కొత్త సినిమా స్క్రిప్ట్ మొదలుపెడతానని పా రంజిత్ ఈ సందర్భంగా తెలిపారు. పా రంజిత్ తన తదుపరి సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా కూడా పా రంజిత్ స్టైల్లో రియలిస్టిక్ కథాంశంతో సాగుతుందని సమాచారం.