రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డులు దక్కడం పట్ల సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సంతోషం వ్యక్తం చేశాడు. తనతో పాటు పనిచేసిన సంగీత కళాకారులు, గాయనీగాయకులకు, తన బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. తన సంగీతాన్ని మెచ్చిన శ్రోతలకు థ్యాంక్స్ చెప్పాడు. అవార్డులతో తన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం రాత్రి రెడియో మిర్చి మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవం కలర్ఫుల్ గా జరిగింది. పవన్ కళ్యాణ్, మంచు లక్ష్మి, ముమైత్ ఖాన్తో పాటు పలువురు సినీతారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా డీఎస్పీ అవార్డులు అందుకున్నాడు. ఈ ఫొటోలను డీఎస్పీ ట్విట్టర్ పోస్టు చేశారు. అతడు మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.