మెగా స్టార్ చిరంజీవి 61 వ పుట్టిన రోజు వేడుకలను ఊరు వాడ గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. రక్తదానాలు, అన్నదానాలు , పేదవారికి బట్టల పంపిణి , మొక్కలు నాటడం వాటి సేవ కార్యక్రమాల్లో అభిమానులు చురుగ్గా పాల్గొంటున్నారు. మరో పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి బర్త్ డే వేడుకను గ్రాండ్ గా అభిమానుల మధ్య జరపాలని ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఫంక్షన్ చేయబోతున్నాడు.
ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, అల్లు శిరీష్ లు గెస్టులుగా హాజరు కాబోతున్నారు. కానీ అసలు వ్యక్తి మాత్రం డుమ్మా కొట్టాడని తెలుస్తుంది. అసలు వ్యక్తి అంటే ఎవరా అని అనుకుంటున్నారా..ఇంకెవరు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నయ్య పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ జరగబోతుంటే పవన్ మాత్రం ఈ వేడుకకు హాజరుకావడం లేదని సమాచారం. ఒకవేళ హైదరాబాద్ లో లేడా అంటే అది లేదు. ఇక్కడే ఉన్నాడు. మరి ఫంక్షన్ కు ఎందుకు రావడం లేదు అనేది మెగా హీరోలకే తెలియాలి. పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ ఎలాగూ ఫ్యామిలీ సంబరాల్లో ఎప్పుడు హాజరు కాలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఈ వేడుకకు దూరంగా ఉంటున్నాడని చెపుతున్నారు. ఏది ఏమయినా పవన్ లేని లోటు ఈ వేడుకలో స్పష్తంగా కనిపిస్తుంది.