సినీ పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్లు ఇంకెక్కడా ఉండవేమో. ఒక సినిమా హిట్టయిందంటే చాలు.. అందులోని రకరకాల కాంబినేషన్లను మళ్లీ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లతో ఇంకో సినిమా వచ్చి తీరాల్సిందే. ?కుమారి 21 ఎఫ్?తో హిట్ పెయిర్ అనిపించుకున్న రాజ్ తరుణ్.. హెబ్బా పటేల్ లతో ఆల్రెడీ రెండో సినిమా కూడా వచ్చేసింది. ?ఈడో రకం ఆడో రకం? కూడా హిట్టయి.. వీళ్లంది సూపర్ హిట్ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మూడో సినిమా మొదలవుతుండటం విశేషం.
?ఢమరుకం? సహా చాలా సినిమాలకు రచయితగా పని చేసిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారబోతున్నాడు. అతడి డైరక్టోరియల్ డెబ్యూ మూవీకి రాజ్ తరుణ్.. హెబ్బాలే హీరో హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నాడు. అనిల్ తో రాజ్ తరుణ్ కు మూడు కమిట్మెంట్లున్నాయి. అందులో ఒకటి ?దొంగాట? ఫేమ్ వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లింది. త్వరలోనే వెలిగొండ శ్రీనివాస్ సినిమా మొదలవుతుంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ అంధుడిగా నడిస్తాడని అంటున్నారు. అదే నిజమైతే రాజ్ తరుణ్ కెరీర్లో ఇది మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. మరి రాజ్-హెబ్బా కలిసి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.