రాజమౌళి సినిమా ఏంటి? ఈ విషయంపై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన లేదు కానీ.. జక్కన్న రీసెంట్ గా ఓ హింట్ మాత్రం ఇచ్చాడు. రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి దిగిన ఓ ఫోటోను రాజమౌళి పోస్ట్ చేసిన తర్వాత.. చాలానే రూమర్స్ దీని చుట్టూ చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిజమేనంటూు రీసెంట్ గా సాయి ధరం తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అక్కడి నుంచి అంచనాలు మరీ పెరిగిపోయాయి.
ఎన్టీఆర్- చెర్రీ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ అయినా.. వీరిలో ఒకరిది క్యామియో రోల్ అని ఒక టాక్. ఈ స్టార్ హీరోలిద్దరూ అన్నాదమ్ములుగా కనిపిస్తారని.. ఇద్దరికీ సమానమైన రోల్స్.. స్క్రీన్ టైం ఉంటాయని మరో మాట వినిపిస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ చిత్రంలో.. హీరోలిద్దరూ బాక్సర్స్ గా కనిపిస్తారన్నది ఇంకో మాట. విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రూపొందించగా.. సల్మాన్-షారూక్ ల కోసం ఈ స్టోరీని ఆయన సిద్ధం చేశాడని.. కానీ అది సెట్ కాకపోవడంతో.. తెలుగులో మల్టీ స్టారర్ సిద్ధం చేశారని అంటున్నారు
ఎన్టీఆర్-చరణ్ లకు ఇప్పటికే రాజమౌళి కథ వినిపించగా.. అసలు కథే వినకుండా ముందే హీరోలిద్దరూ ఓకే చెప్పేశారన్నది ఇంకో మాట. ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయించారని.. కేవలం రెమ్యూనరేషన్స్ రూపంలోనే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని అంటున్నారు.
ఇప్పటికైతే ఇవన్నీ అంచనాలు.. ఊహాగానాలు మాత్రమే. వీటిపై అటు ఎన్టీఆర్ నుంచి.. ఇటు రామ్ చరణ్ నుంచి.. మరోవైపు రాజమౌళి నుంచి కానీ.. ఆయన టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.