సూపర్ స్టార్ రజనీ కాంత్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో వచ్చిన ప్రభంజనం ?రోబో?కి సీక్వెల్గా ప్రస్తుతం ?రోబో 2? తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. రజనీతో పాటు ఈ సినిమాలో విలన్గా నటిస్తోన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొంటుండగా ఓ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు.
ఇక కొద్దికాలంగా ఢిల్లీలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయినా కూడా టీమ్ ఆ ఎండలను సైతం లెక్కచేయకుండా షూటింగ్ జరుపుతోంది. నేడు సుమారు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ టీమ్ ఓ ఔట్డోర్ సన్నివేశాన్ని తీస్తూ ఉండడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. మరో పదిరోజులు ఢిల్లీలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఏప్రిల్ 22 తర్వాత టీమ్ తిరిగి చెన్నైలో మరో షెడ్యూల్ కోసం ప్లాన్ చేయనుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఏ.ఆర్.రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.