అక్కినేని అఖిల్ తో కలిసి టాలీవుడ్ అరంగేట్రం చేసిన బ్యూటీ సాయేషా సైగల్. దిలీప్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీకి.. అఖిల్ తో నిరాశే ఎదురైంది.
అయితే.. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన శివాయ్ మూవీలో ఛాన్స్ రావడం.. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకున్న ఈ సుందరికి.. తాజాగా ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో ఈ అమ్మడికి ఛాన్స్ వచ్చిందన్నారు. తమిళ డైరక్టర్ నేసన్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాలో సాయేషానే హీరోయిన్ అనే వార్తలు ఇప్పుడు రూమర్స్ అని తేలిపోయాయి.
పవన్ కళ్యాణ్ సినిమాలో నేను హీరోయినా? నేను పవన్ సినిమాకి సైన్ చేయడం జరగలేదు. అసలు పవన్ సినిమా కోసం నా పేరు పరిశీలిస్తున్నారని తెలిసినా చాలా సంతోషిస్తా. ఇప్పటి వరకూ నేను ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదనే మాట వాస్తవం' అని తేల్చేసింది సాయేషా. ప్రస్తుతం కోలీవుడ్ లో వనమగన్ అనే మూవీ చేస్తోందీ భామ.