వచ్చే ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ?బాహుబలి? విడుదల తేదీ ఖరారైపోయింది. మరి మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ?2.0? ఎప్పుడు అనే విషయంలో ప్రేక్షకులు గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళానికి తెరదించుతూ వచ్చే ఏడాది దీపావళికి రోబో సీక్వెల్ వచ్చేస్తుందని ప్రకటించేసింది ?లైకా ప్రొడక్షన్స్? సంస్థ. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని శంకర్ త్రీడీలో తెరకెక్కిస్తున్నాడు. శంకర్ తీస్తున్న తొలి త్రీడీ మూవీ ఇదే. త్రీడీ విషయంలోనూ ప్రపంచస్థాయి టెక్నాలజీని వినియోగిస్తున్నారట. ఎడిటింగ్ సమయంలోనూ త్రీడీ గ్లాసెస్ వేసుకుని పని చేయాల్సి వచ్చిందని ఎడిటర్ ఆంటోనీ చాలా విశేషంగా చెప్పుకున్నాడు నిన్న.
2.0 విశేషాల సంగతి పక్కనబెడితే.. రోబో సిరీస్ లో ఇంకో సినిమా కూడా ఉంటుందని చెప్పడం నిన్నటి ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమంలో అతి పెద్ద విశేషం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేదు కానీ.. 2020లో విడుదలవుతుందని మాత్రం శంకర్ వెల్లడించాడు. ఈ వార్త రోబో ప్రియులకు మహదానందాన్ని కలిగించేదే. ఈ చిత్రాన్ని 3.0 పేరుతో తెరకెక్కిస్తారట. ఐతే ?రోబో? ఎవరెస్టును ఎక్కడం లాంటిదైతే.. 2.0 ఎవరెస్టును మోయడం లాంటిదని చెప్పిన శంకర్.. 3.0 కోసం ఇంకెంత కష్టపడాల్సి ఉంటుందో. రజినీకి ఇప్పటికే ఓపిక తగ్గిపోయిందని.. మేకప్ విషయంలో.. లాంగ్ షెడ్యూళ్ల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. మరి 3.0 చేసే ఓపిక ఆయనకు ఉంటుందా అన్నదే డౌటు.