బాహుబలి2 సునామీ కారణంగా.. ఈ సమ్మర్ లో భారీ చిత్రాలేమీ షెడ్యూల్ చేయలేదు. అయితే మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రం వారానికొకటి చొప్పున క్యూ కట్టేస్తున్నాయి. గత వారంలో శర్వానంద్ నటించిన రాధ రిలీజ్ అయింది. ఈ శుక్రవారం నిఖిల్ నటిస్తున్న కేశవ విడుదల కాబోతోంది.
రాధ కంటెంట్ పై టాక్ అటూఇటూగా ఉన్నా బాహుబలి2 మేనియా.. ఈ చిత్రానికి బాగానే ప్లస్ అయింది. వీకెండ్ లో మంచి వసూళ్లే సాధిస్తుండగా.. రియల్ టెస్ట్ సోమవారం స్టార్ట్ అవుతుంది. ఇక మే 19న విడుదల కానున్న రివెంజ్ డ్రామా కేశవకు దర్శకుడు సుధీర్ వర్మ. ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. నిజానికి సుధీర్ వర్మ తొలిసినిమా స్వామి రారా సూపర్ సక్సెస్ అయితే.. రెండో మూవీ దోచెయ్ ఫ్లాప్ అయింది. మూడో మూవీగా కేశవ తెరకెక్కింది. సహజంగా రిజల్ట్ చూశాకే హీరోలు సినిమా ఒప్పుకుంటారు.
కానీ శర్వానంద్ మాత్రం సుధీర్ వర్మపై ఉన్న నమ్మకంతో.. సుధీర్ వర్మ సినిమాకి ఇప్పటికే సై అనేశాడట. హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఈ మూవీ రూపొందనుండడం విశేషం.