ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగా హీరో అల్లు శిరీష్ చిత్రం ?శ్రీరస్తు శుభమస్తు?. సినిమా ఫలితం ఎలాగున్నా.. శిరీష్ బాగా బాగుపడ్డాడు అనే సంతృప్తితో ఉంది మెగా ఫ్యామిలీ. శిరీని ఆ మాత్రమైన చెక్కిన క్రెడిట్ ని దర్శకుడు పరశురామ్ కి ఇచ్చాడు నిర్మాత అల్లు అరవింద్. అంతేకాదు.. గీతాఆర్ట్స్ లో ఆయనకి మరో అవకాశం కూడా ఇచ్చారు. వెండితెరపై యావరేజ్ సినిమాగా నిలిచిన శిరీష్ శ్రీరస్తు శుభస్తుకి బుల్లితెరపై మాత్రం భలే గిరాకీ ఏర్పడింది.
?శ్రీరస్తు శుభమస్తు? శాటిలైట్ హక్కుల కోసం గట్టి పోటి ఏర్పడింది. చివరికి ఓ ప్రముఖ ఛానల్ దాదాపు రూ.3కోట్లు చెల్లించి మరీ దక్కించుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. శిరీష్ సినిమాకి ఇంత పెద్ద మొత్తం శాటిలైట్ రేటు పలకడం నిజంగా గ్రేట్. ఇక, ఈ చిత్రంలో శిరీష్ కి జంటగా నటించిన లావణ్య త్రిపాఠి ఆకట్టుకొంది.