Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2017 13:10:24
facebook Twitter Googleplus
Photo

వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీ కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీలో తళుక్కున మెరిసింది శ్వేత బసు ప్రసాద్. చిలిపిదనం నిండిన మొహంతో.. అరవిరిసిన నవ్వులతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంది. ఆ తరవాత నిఖిల్ తో కలిసి కళావర్ కింగ్ సినిమా చేసింది. అది పెద్దగా ఆడలేదు. అంతే.. ఆ తరవాత శ్వేత బసు ప్రసాద్ పెద్దగా కనిపించింది లేదు.

వరస ఆఫర్లు వస్తాయని ఆశపెట్టుకున్నా తెలుగులో ఛాన్సులు రాకపోవడంతో తిరిగి శ్వేత బాలీవుడ్ కెళ్లి చిన్నాచితకా పాత్రలు చేసింది. ఈ టైంలో ఆమెకు చంద్రనందిని అనే టీవీ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. సాధారణంగా సీరియళ్లంటే చెప్పాల్సిన పనేముంది.. చాలాకాలం పాటు సా...గుతూ.. ఉంటాయి. చివరకు ఆ సీరియల్ కూడా అయిపోయింది. దీంతో పాపం శ్వేత ఒక్కసారిగా డీలా పడింది. చివరకు తన బాధ సోషల్ నెట్ వర్క్ లో వెళ్లబోసుకుంది. ‘‘చంద్రనందిని సీరియల్ ముగిసిపోయింది. ఇందులో నేను చేసిన మహారాణి రోల్ ను ఎప్పటికీ మర్చిపోను. ఈ సీరియల్ అయిపోయిదంటే ఎంతో బాధగా ఉంది. రేపటి నుంచి స్టూడియోకి వెళ్లాల్సిన పనిలేదన్న మాటే బాధించేస్తోంది అంటూ తెగ ఫీలయిపోయింది.

ఇంతకాలం సీరియల్ షూటింగ్ లో బిజీగా ఉంది కాబట్టి ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు శ్వేతబసు వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఆఫర్ వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకోవడం ఖాయం.

,  ,  ,  ,  ,