Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2017 10:38:31
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పారిశ్రామిక వేత్త కం నిర్మాత అయిన టీ సుబ్బిరామిరెడ్డి ఓ మాట చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో ఓ సినిమా చేస్తానని చెప్పారు. అయితే.. అంత పెద్ద ఫంక్షన్ లో ఆయన అంత పెద్ద మాట చెప్పడం అంటే.. మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేందుకే అని అంతా అనుకున్నారు.

అసలు మెగా ఫంక్షన్లకే హాజరు కాని పవన్ కళ్యాణ్.. మిగిలిన హీరోలతో కలిపి సినిమా చేస్తాడా అనే డౌట్లు చాలామందికే వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు నిజంగానే పట్టాలెక్కే అవకాశాలున్నాయట. ఖైదీ నంబర్ 150 సక్సెస్ పురస్కరించుకుని.. ఒక ఆత్మీయ వేడుక నిర్వహించారు సుబ్బిరామిరెడ్డి. ఇక్కడ కూడా చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ లతో కలిపి సినిమా తీస్తానని చెప్పడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ మూవీ నిర్మాణంలో అశ్వినీదత్ కూడా భాగం అవుతాడని చెప్పారు సుబ్బిరామిరెడ్డి.

ఒకే ప్రాజెక్టు గురించి ఒకటికి పలుమార్లు చెప్పడం అంటే.. నిజంగానే దీనికి సంబంధించిన మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. మెగా ఫ్యామిలీలోని స్టార్లు అందరితో మహా కాంబోను నిజంగా సాధ్యం చేస్తే మాత్రం.. సుబ్బిరామిరెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

,  ,  ,  ,  ,  ,