ఎప్పుడూ గోదావరి నదితీరాన.. కోనసీమ.. పాపికొండలు.. వంటి అందాలను ఏం చూపిస్తాంరా బుజ్జీ.. అనుకునే జనాలు ఉన్న ఈరోజుల్లో.. సీనియర్ దర్శకుడు వంశీ మాత్రం ఎల్లప్పుడు ఆ గోదావరి అందాల నడుమే తన సినిమాలను తీస్తుంటాడు. అలా ఆయన తీసిన క్లాసిక్ ''లేడీస్ టైలర్''. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ సినిమాను.. అక్కడే తీయడం విశేషం.
మామూలుగా సినిమా షూటింగ్ మొదలెట్టాలంటే.. ముహూర్తం షాట్ అదీ ఇదీ అంటూ హడావుడి చేసే ఈ రోజుల్లో.. పసలపూడి వంశీ మాత్రం సైలెంటుగా తన కొత్త సినిమా ''ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్''ను మాత్రం గోదావరి ఒడ్డున హ్యాపీగా చడీచప్పుడు కాకుండా షూట్ చేసేస్తున్నాడు. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోకాగా.. అనీషా ఆంబ్రోస్.. మానస.. మనాలి రాథోడ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్ళందరూ కలసి ప్రస్తుతం గోదావరి తీరాన సన్ రైజ్ సన్ సెట్ వేళళ్ళో వంశీ షూటింగ్ అదరగొట్టేస్తున్నాడట.
ఎలాగైనా సరే ఈ సినిమాతో మరోసారి తన సత్తా నిరూపించాలని ఫిక్సయిన వంశీ.. ఈ సినిమా కోసం మణిశర్మ దగ్గరనుండి చాలా డిఫరెంట్ గా ఉండే బాణీలను అందుకోవడమే కాదు.. వాటిని ఇంకా ఏస్తటిక్ గా చిత్రీకరిస్తున్నాడట. అది సంగతి.