Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jun-2017 10:36:23
facebook Twitter Googleplus
Photo

త్వరలోనే మురుగదాస్ డైరక్షన్లో వస్తున్న స్పైడర్ సినిమాలో సిబిఐ ఆఫీసర్ గా.. కొరటాల శివ డైరక్షన్లో భరత్ అనే నేను సినిమాలో రాజకీయ యువ నాయుకుడుగా కనబడనున్నాడు మహేష్ బాబు. స్పైడర్ సినిమా అంతా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. కొరటాల శివ సినిమా కూడా మొదలైంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు పూర్తి కాకుండానే మరో సోషల్ డ్రామా సినిమాకు ఓకే చెప్పాడట మహేశ్ బాబు.

ఊపిరి సినిమా డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి మహేశ్ బాబుకి ఈ మధ్యే ఒక కథ వినిపించాడట. ఇప్పటికే ఈ కాంబినేషన్ సినిమా లేటవుతుండగా.. ఇప్పుడు చెప్పిన కథ బాగా నచ్చేయడంతో.. వెంటనే మహేష్ పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది. దీనిపై వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ఒక నటుడుగా కథను ఎలా ఎంతవరుకూ అర్ధం చేసుకోవాలో మహేశ్ ఆ విధంగా అర్ధం చేసుకున్నాడు. ఒక డైరెక్టర్ గా నాకు అంతకన్నా ఇంకా ఏమి కావాలి. ఇప్పుడు ఈ కథ స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. మహేశ్ బాబుకి నాకు ఇది ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పాడు. వంశీ పైడిపల్లి ముందు సినిమా ఊపిరిలో కాళ్ళు చచ్చుబడిపోయిన కోటీశ్వరుడి కథను చాలా చక్కగా చెప్పి అందరి ప్రశంసలు పొందాడు. ఇప్పుడు కూడా మహేశ్ తో అటువంటి డ్రామా తీయబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు కథ గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. అన్నీ ఓకే అనుకున్నాక మేమే చెబుతాం అని తప్పుకున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే గా నటించబోతుంది అని ఒక టాక్ వచ్చింది. వంశీ పైడిపల్లి మొదటిసారిగా మహేశ్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,