ఇటీవల విడుదలైన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, హీరో హీరోయిన్లు శర్వానంద్, నిత్యా మీనన్ లకు ఆర్టిస్టులుగా మంచి పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం శాటిలైట్ హక్కుల కోసం పోటీ ఏర్పడగా, మాటీవీ వీటిని దక్కించుకున్నట్టు చెబుతున్నారు. పైగా, నాలుగు కోట్ల భారీ ధరను వెచ్చించి మరీ ఈ హక్కులను పొందారట. 'ఓనమాలు' ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ దీనిని నిర్మించిన సంగతి విదితమే!
sharvanand, mallimalliidiraniroju, nityamenon, maatv,