Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2015 16:03:54
facebook Twitter Googleplus
Photo

మహేష్ శ్రీమంతుడు ప్రభావం సెలబ్రిటీలపై అసాధారణంగా ఉంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో మంచి చేసింది. మహేష్ తనంతట తానుగా ఏపీ తెలంగాణలోని రెండు గ్రామాల్ని దత్తత తీసుకున్నాడు. అదే బాటలో ప్రకాష్ రాజ్ - శృతిహాసన్ - మంచు విష్ను గ్రామాల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు ఈ హీరోల ఇన్ స్పిరేషన్ తో హీరో కం డైరెక్టర్ ఆదిత్య ఓం ఓ రెండు గ్రామాల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చాడు.

భద్రాచలం సమీపంలోని చేరుపల్లి(ఖమ్మం జిల్లా)ని దత్తత తీసుకున్నాడు. ఇదో రూరల్ ఏజెన్సీ ఏరియా. ఛత్తీష్ ఘడ్ - ఏపీ బార్డర్ లో ఉంది. ఇదేగాక అతడు మరో సామాజిక కార్యక్రమానికి కార్యాచరణ ప్లాన్ చేశాడు. ఖమ్మం లోకల్ ఎన్జీవోస్ ఆనందం ఫౌండేషన్ - అమ్మా నాన్న ఫౌండేషన్ తో కలిసి స్థానిక ప్రజలకు స్కిల్ డెవలప్ మెంట్ - తాగు నీటి సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నాడు.10ఏళ్ల పాటు నిరంతరాయంగా ఈ సేవల్ని అందించేందుకు నిర్ణయించుకున్నాడు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని వేరొక విలేజ్ ని అభివృద్ధి చేసేందుకు ముందుకొస్తున్నాడు. అంతటితో ఆగిపోకుండా ఎడ్యులైట్ మెంట్ ఎడ్యుకేషనల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేశాడు. గాంధీ జయంతి రోజున ఈ అవేర్ నెస్ ప్రోగ్రామ్ ని హైదరాబాద్ లో మొదలుపెట్టారు. విద్య పరంగా వెనకబడిన పిల్లల్ని చదివించాలన్నది ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఆదిత్య ఓం ఎంచుకున్న ఈ సామాజిక సేవా కార్యక్రమాలు ఇన్ స్పయిరింగ్. మన హీరోలందరూ అతడిని చూసి నేర్చుకోవాల్సిందే.

లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో ఆదిత్య ఓం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా ఆశించినంత పెద్ద విజయాల్ని అందుకోలేదు. ఇటీవలి కాలంలో ఆల్ మోస్ట్ ఫేడవుట్ హీరోగానే టైమ్ పాస్ చేశాడు. ప్రస్తుతం ఫ్రెండ్ రెక్వస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణాంనతర పనుల్లో ఉంది. బట్ సినిమాల్లో పొజిషన్ ఎలా ఉన్న సేవల్లో మాత్రం శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడులే.

,  ,  ,  ,