మరో ముంబయ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించిన నేహాశర్మ చెల్లి అయీషా తన వెండితెర ఎంట్రీని ఇస్తోంది. యంగ్ హీరో రామ్ సరసన కథానాయికగా ఆమె పరిచయం అవుతున్నట్టు తాజా సమాచారం. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న 'శివం' చిత్రానికి హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేశారు. అయీషా ఇప్పటికే కొన్ని సంస్థలకు మోడలింగ్ చేసింది. నటిగా మారాలన్న ఉద్దేశంతో అక్క సలహాతో నటన, డ్యాన్సులో శిక్షణ కూడా తీసుకుంది. రామ్ సరసన నటించే ఛాన్స్ రావడం పట్ల ఈ చిన్నది చాలా హ్యాపీగా వుంది.
ram, dsp, newmovie, tollywood, news, shivam, aisha,