అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా డిజె దువ్వాడ జగన్నాథమ్. ప్రస్తుతం షూటింగ్ బ్రేకులో ఉంది కాని.. త్వరలోనే సెట్స్ మీదకు వెళిపోయి.. జూలై మొదటివారంలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే సాగిపోతోంది తెలుసా.
ముఖ్యంగా శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే.. ఇప్పుడు కొత్త విషయం తెలుస్తోంది. అసలు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను టైటిల్ లాంచ్ చేసి సినిమాను ప్రారంభిస్తున్నాం అని చెప్పిన రోజునే అమ్మేశారట. అదేరోజున దిల్ రాజు గారితో ఉన్న అనుబంధంతో జి తెలుగు వారు కొనేశారిన తెలుస్తోంది. సాధారణంగా హిందీ సినిమాలను కొనేటప్పుడు.. ఒకే నిర్మాణ సంస్థకు చెందిన దాదాపు నాలుగైదు సినిమాలను ఒకేసారి ఒకరికే అమ్మేస్తుంటారు. చూస్తుంటే ఇప్పుడు దిల్ రాజు అండ్ జీ తెలుగు ఛానల్.. తెలుగులో కూడా అదే ట్రెండ్ ఫాలో అవతున్నట్లున్నారు కదూ.
ఇంతకీ ఈ సినిమా శాటిలైట్ ఎంత రేటుకు అమ్మారు? ఆ విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. ఇకపోతే హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. సరైనోడు వంటి 70 కోట్ల హిట్ తరువాత వస్తోంది కాబట్టి.. అంచనాల విషయంలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి.