స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ దర్శకుడు భోయపాటి శ్రీను కాంబినేషన్లో సరైనోడు పేరుతో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. రేపు (ఏప్రిల్ 22న) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఉత్సాహంలో ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ కోసం రిలీజ్కు ముందు రోజు అర్థరాత్రి ఏర్పాటు చేసే ఫ్యాన్స్ షోస్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇప్పటికే అర్థరాత్రి షోస్ ఉండడం లేదన్న విషయం స్పష్టమైనా, ఉదయం 5 గంటలకు మాత్రం ఫ్యాన్స్ షోస్ ప్రదర్శితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. హైద్రాబాద్లోని నాలుగు థియేటర్స్లో ఈ ఎర్లీ షోస్ వేసేలా ప్లాన్ చేశారు. అయితే ఈ 5 గంటల షోస్కి కూడా ఇంకా పోలీసుల అనుమతి రావాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చాక, ఫ్యాన్స్ షో పరిస్థితేంటీ? అన్నది తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించారు.