గతేడాది శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్లో ఒక సినిమాని మొదలుపెట్టనున్నాడు. విఐ ఆనంద్ కూడా 2016 లో నిఖిల్ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో భారీ విజయం సొంతం చేసుకుని అందరి దుష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే సైటిఫిక్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చనున్నారని సమాచారం. తన సంగీతంతో సినిమా స్థాయిని పెంచగలిగిన మణిశర్మ పనిచేయడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఈ సినిమా మార్చి నుండి మొదలయ్యాయి అవకాశాలుండగా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనేది త్వరలోనే తెలియనుంది. ప్రసుతం శిరీష్ నటించిన మలయాళ చిత్రం 1971 బియాండ్ బోర్డర్స్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.