మణిరత్నం దర్శకత్వంలో మాధవన్, సిమ్రాన్ జంటగా పదేళ్ల క్రితం వచ్చిన 'అమృత' సినిమా గుర్తుంది కదా... అందులో చిన్నారిగా నటించిన కీర్తన తన అభినయంతో అందరి హృదయాలనూ గెలుచుకుంది. పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని అంతా ఆశించారు. అయితే, అందరి అంచనాలకూ భిన్నంగా ఈ చిన్నది ఇప్పుడు దర్శకత్వపు శాఖలో తర్ఫీదు పొందుతోంది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన కీర్తన దర్శకురాలవ్వాలన్న ఉద్దేశంతో తాజాగా త్యాగరాజన్ కుమారరాజా వద్ద అసిస్టెంట్ గా చేరింది. ఆమె తల్లి సీత అప్పట్లో కథానాయికగా రాణించగా... తండ్రి పార్తీపన్ హీరోగా, తదనంతర కాలంలో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కీర్తన కూడా తండ్రి బాట పట్టింది. దర్శకురాలిగా రాణించాలని ఆశపడుతోంది. ఆల్ ది బెస్ట్ చెబుదాం!
amrutha, maniratnam, simran, madhavan,