మోడల్ గా, నటిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన అమీ జాక్సన్ చాలా తక్కువ కాలంలోనే మంచి పేరుని, గుర్తింపుని సాధించింది. ?మదరాసపట్టణం? అనే తమిళ్ సినిమాతో పరిచయం అయిన అమీ జాక్సన్? ఏక్ దివాన థా (హిందీ), ఎవడు (తెలుగు), ?ఐ? సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆమె ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో ?రోబో?కి సీక్వెల్గా రూపొందుతున్న ?2.0? చిత్రంలోను, విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ?థెరి? చిత్రంలోనూ నటిస్తోంది.
ఇన్ని సినిమాలలో నటించినా అమీ జాక్సన్ కి ఒక హీరోతో నటించాలని కోరిక మాత్రం బాగా ఉందట. ఆ హీరో మరెవరో కాదు? బాహుబలి తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభాస్. ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని తాను ఇష్టపడతానని చెప్పడంతో బాటు ?బాహుబలి? లో ప్రభాస్ ని చూసి విస్మయం చెందానని కూడా అమీ జాక్సన్ చెప్పింది. మొత్తానికి అమీ జాక్సన్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి..