హారర్, థ్రిల్లర్ చిత్రాలకు చిరునామాగా నిలిచింది అంజలి. గీతాంజలితో ఆ తరహా కథల్లో ఆమెనే కథానాయికగా ఎంచుకొంటున్నారు. తాజాగా మరో దెయ్యం కథలో నటించడానికి అంజలి ఒప్పుకొందని టాక్.
ఓంకార్ దర్శకత్వం వహించిన రాజుగారి గది.. భారీ లాభాలతో అదరగొట్టింది. రెండున్నర కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపుగా 7 కోట్లు అందుకొంది. ఆ ధైర్యంతోనే? రాజుగారి గది 2కి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు ఓంకార్.
ఇందులో కొన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్ జత చేస్తున్నాడు. కథానాయికగా అంజలి ని తీసుకొంటే మార్కెట్ పరంగా క్రేజ్ ఉంటుందని భావించిన ఓంకార్.. అంజలిని సంప్రదించాడట. దినీకి అంజలి ఆమోదం తెలపడం కూడా జరిగింది. సో.. రాజుగారి గదిలో అంజలి కూడా అడుగుపెట్టబోతోందన్నమాట. రాజుగారి గదిని సూపర్ సక్సెస్ చేసిన ఓంకార్.. ఆ మ్యాజిక్ ను సీక్వెల్ లో రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.