ఇటీవలి కాలంలో నాలుగైదు సినిమాలు చేసి, పేరు తెచ్చుకోగానే, కొందరు కమెడియన్లు హీరోలుగా కూడా మారిపోతున్నారు. 'ప్రేమకథా చిత్రం', 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' వంటి సినిమాల ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి కూడా ఇప్పుడు హీరోగా మారుతున్నట్టు సమాచారం. ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంటు సంస్థ శ్రేయాస్ మీడియా ఇతనిని హీరోగా తీసుకుని ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి 'ఆరడుగుల బుల్లెట్' అనే పాప్యులర్ పదాన్ని టైటిల్ గా పెడుతున్నారట!
sapthagiri, hero, shreyasmedia, tollywood, news,