సంగీత సంచలనం ఏ.ఆర్.రెహ్మాన్ తన స్టేజ్ పెర్ఫార్మెన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు. మణిరత్నం రూపొందిస్తున్న 'ఓకే బంగారం' చిత్రం ఆడియో వేడుక ఈ నెల 4న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించి చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా, రెహ్మాన్ ఈ చిత్రంలోని తెలుగు పాటలను ఆనాటి వేదికపై పెర్ఫార్మ్ చేయనున్నాడు. సాధారణంగా తెలుగు సినిమా వేడుకలకు రెహ్మాన్ రావడమే అరుదు. అలాంటిది స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఓ ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు!
maniratnam, okbangaram, dilraju, tollywood, news, arrahman, audioon4thapril,